టెస్టుల్లో తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలతో
టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. అంతేకాదు టెస్టుల్లో టాస్ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు బ్లేజర్లతో వెళ్లాలి. వన్డేల్లో మాత్రం అలా కాదు. అయితే, ఈ సంప్రదాయం త్వరలోనే మారబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ యాషెస్ సిరిస్లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇరు దేశాలకు చెందిన బోర్డులు ఐసీసీకి ప్రతిపాదన పంపాయి.
ఐసీసీ గనుక ఆమోదం తెలిపితే
ఈ ప్రతిపాదనకు ఐసీసీ గనుక ఆమోదం తెలిపితే టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు పేర్లతో పాటు జెర్సీలపై నంబర్లతో కనిపించనున్నారు. ఎడ్జ్బాస్టన్లో వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఆరంభమవుతుంది. ఆటగాళ్లు ఒకటి నుంచి 99 వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై ముద్రించేందుకు ఎంపిక చేసుకోవచ్చు.