న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో టి నటరాజన్ ఒకడు. తన ప్రారంభ ధర కంటే ముప్పై రెట్టు అధికంగా అమ్ముడుపోయిన నటరాజన్ తన ప్రారంభ ధరను రూ.10లక్షలుగా వేలంలోకి దిగాడు. తమిళనాడుకు చెందిన తంగారసు ఓ దినసరి కూలీ కొడుకు. మాంసాన్ని అమ్ముకునే వృత్తి నేపథ్యమున్న వారు. అయితే ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తితో పది లక్షల రూపాయలు కనీస ధరతో దిగి మూడు కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సొంతమైయ్యాడు.
ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆడిన నటరాజన్ అరంగ్రేట సీజన్లోనే ఏడు మ్యాచ్లు ఆడి పది వికెట్లు తీయగలిగాడు. నటరాజన్పై ఉన్న భారీ అంచనాలు, ఊహలు అతనిపై ఒత్తిడి పెంచాయి. దీంతో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో.. ఆరు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత గాయాలపాలై ఐదు నెలల పాటు ఏ మ్యాచ్ ఆడకుండా చికిత్సకే పరిమితమైయ్యాడు. మరోసారి తన ప్రారంభ ధరకు రూ.40లక్షలకే సన్రైజర్స్ హైదరాబాద్కే అంకితమైయ్యాడు. కానీ, ఈ ఏడాది సీజన్లో దురదృష్టవశాత్తు ఒక్క గేమ్ లోనూ ఆడలేకపోయాడు.
ఫాస్ట్ బౌలింగ్ చేసే దిశగా నటరాజన్ తన శరీరంపై ఒత్తిడి పెంచుకున్నాడు. దీంతో అతను వెజిటేరియన్ ఆహారం పూర్తిగా మానేశాడు. ఈ క్రమంలోనే డైట్లో దాదాపు మాంసాహరాన్నే ఉండేలా చూసుకుంటున్నాడట. తినేందుకు కూడా ఈ హద్దులేంటో నాకు అర్థం కావట్లేదు. నేను కూరగాయలు తినడం మానేశాం. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు ప్రత్యర్థిగా ఆడి మూడు గేమ్స్లోనే 13వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఒకానొక సందర్భంలో తంగరుస.. ముత్తయ్య మురళీధర్ను ప్రేరణగా తీసుకుని ఆఢినట్లు అంతనే చెప్పుకొచ్చాడు. నేను పరిస్థితలను త్వరగా అర్థం చేసుకుంటాను. ఎలాంటి ఫార్మాట్ కు తగ్గ ఆట ఆడనగలను అని తమిళనాడు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, వారి వద్ద సూచనలు తీసకుంటూనే ఉన్నానని వివరించాడు.