టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో లక్ష్మణ్
శనివారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో లక్ష్మణ్ "దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్, ఆ తర్వాత వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అంబటి రాయుడు నిలకడగా రాణించాడు. వాస్తవానికి నెం.4 బ్యాటింగ్ స్థానం జట్టులో చాలా ప్రత్యేకం" అని అన్నాడు.
బ్యాట్స్మెన్కి స్ట్రైక్ని రొటేట్ చేయగలగాలి
"ఎందుకంటే, అప్పటికే క్రీజులో కుదురుకున్న బ్యాట్స్మెన్కి స్ట్రైక్ని రొటేట్ చేయగలగాలి. ఒకవేళ ఆ బ్యాట్స్మెన్ ఇబ్బందిపడుతుంటే తనే బాధ్యత తీసుకుని హిట్టింగ్తో స్కోరు బోర్డుని నడిపించాలి. అంబటి రాయుడు ఈ రెండు బాధ్యతల్ని వెస్టిండీస్తో సిరీస్లో చక్కగా నిర్వర్తించాడు" అని లక్ష్మణ్ తెలిపాడు.
స్పిన్నర్ల బౌలింగ్లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు
"స్పిన్నర్ల బౌలింగ్లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు ఆడాడు. అదేవిధంగా పేసర్ల బౌలింగ్లో కుదురుగా క్రీజులో నిలబడి పరుగులు రాబట్టాడు. 2013లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా.. రాయుడి అనుభవం టీమిండియాకు రాబోయే రోజుల్లో కలిసి రానుంది" అని అన్నాడు.
10 ఇన్నింగ్స్ల్లో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు
ఇటీవలే దుబాయి వేదికగా ముగిసిన ఆసియా కప్ ద్వారా అంబటి రాయుడు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడంతో రాయుడు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు మొత్తం 10 ఇన్నింగ్స్లాడిన రాయుడు ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం తొలి టీ20
భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరగనుంది.