|
కెప్టెన్గా రోహిత్ శర్మ
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో హాంకాంగ్తో తలపడుతుండగా... ఆ తర్వాతి రోజైన బుధవారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లు దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. వర్క్లోడ్, రాబోయే సిరిస్లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
|
తొలి మ్యాచ్లో నెగ్గి టోర్నీని విజయంతో
హాంకాంగ్తో జరగనున్న తొలి మ్యాచ్లో నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించాలని టీమిండియా ఊవిళ్లూరుతోంది. మరోవైపు పాక్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడిన హాంకాంగ్ కనీసం రెండో మ్యాచ్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారిగా రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ అనుభవం అంతగా లేని హాంకాంగ్ జట్టుపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని రోహితే సేన తహతహలాడుతోంది.
పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్
మరోవైపు అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్-హాంకాంగ్ జట్ల మధ్య ఇప్పటిదాకా ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో భారత జట్టే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కూడా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.