మాకు మ్యాటరే కాదు..
ఆస్ట్రేలియాలో ఏ స్టేడియంలోనైనా సరే డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇండియాతో డేనైట్ గురించి ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ను గతేడాది ప్రశ్నించగా.. ఈ విషయం కోహ్లీనే అడగాలి. మంచి మూడ్లో ఉంటే ఒప్పుకుంటాడేమో అంటూ వెటకారం చేశాడు. ఆవిషయాన్ని సోమవారం కోహ్లీ ముందు ప్రస్తావించగా.. పింక్ బాల్ సవాల్కు తాము సిద్ధమేనని తెలిపాడు .
‘పింక్ బాల్ సవాల్ కు మేము రెడీ. మ్యాచ్ గబ్బాలోనా, పెర్త్లోనా? అనేది మాకు పెద్ద విషయమే కాదు. డేనైట్ మ్యాచ్.. టెస్ట్ సిరీస్పై ఆసక్తి పెంచుతుంది. డే నైట్ టెస్ట్లు ఆడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈడెన్ గార్డెన్స్లో మేం ఆడిన పింక్ బాల్ మ్యాచ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ టీమ్నైనా, ఎక్కడైనా ఓడించే సత్తా మాకుంది.'అని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.
ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులతో గంగూలీ భేటీ..
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో అనధికారికంగా సమావేశమయ్యారు. ఐసీసీ తీసుకొచ్చిన ఫోర్ డే టెస్ట్ ప్రతిపాదన, ఫోర్ నేషన్ సూపర్ సిరీస్, డే నైట్ టెస్ట్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై ఇరు జట్లు అధికారిక ప్రకట చేయకపోయినప్పటికీ భారత్-ఆస్ట్రేలియా డేనైట్ మ్యాచ్పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి డే/నైట్ మ్యాచ్ గురించి ఎలాంటి విధివిధానాలు ఫైనల్ కాకపోయినప్పటికీ.. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో పింక్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
India vs Australia: ధావన్, రాహుల్ కోసం కోహ్లీ త్యాగం!
న్యూజిలాండ్ టూర్లో డే/నైట్ లేదు..
ఇండియా అప్కమింగ్ న్యూజిలాండ్ టూర్లో డే/నైట్ మ్యాచ్ జరిగే చాన్స్ లేదని బీసీసీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కివీస్ నుంచి ఎలాంటి ప్రపోజల్ రాలేదన్నారు. ఇక 2023 నుంచి టెస్ట్లను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను మెజార్టీ క్రికెటర్లు వ్యతిరేకించడమే కాకుండా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.