దాదా కెప్టెన్సీకి ఎసరు:
తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'పీఎల్ ఆరంభ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు బుచానన్ కోచ్. గంగూలీ కెప్టెన్. కేకేఆర్లోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. మొదట్లో వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. 2009లో బుచానన్ బహుళ సారథ్య పద్ధతిని ప్రవేశపెట్టాలనుకున్నాడు. అది గంగూలీకి అస్సలు ఇష్టం లేదు. వీరిద్దరి మధ్య సారుప్యం కుదరలేదు' అని అన్నాడు.
బుచానన్ విజయవంతం అయ్యాడు:
'సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగిద్దామని జాన్ బుచానన్ అనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యాడు. ఆ తర్వాత సీజన్లో బ్రెండన్ మెక్కలమ్ నాయకుడిగా ఎంపికయ్యాడు. కానీ మొదటి సీజన్లో పరుగుల వరద పారించిన అతడు 13 మ్యాచుల్లో 189 పరుగులే చేశాడు. ఇక పాయింట్ల పట్టికలో జట్టు 8వ స్థానంలో నిలిచింది. తొలి సీజన్లో ఆరో స్థానంలో ఉంది. మళ్లీ దాదా సారథిగా ఎంపికవ్వగా.. బుచానన్ వెళ్లిపోక తప్పలేదు' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
2012, 14లలో టైటిల్ విజేత:
నిజానికి కోల్కతా నైట్రైడర్స్ ముగ్గురు కెప్టెన్ల విధానం అనుసరించేందుకు ప్రయత్నించిందని క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చివరికి అది డామినో ప్రభావానికి దారితీసిందన్నాడు. దాంతో మిగతా అన్నిటిపై ప్రతికూల ప్రభావం పడిందన్నాడు. బుచానన్ తనకు కావాల్సిన సహాయకులు, కుటుంబ సభ్యులు,స్నేహితులను నియమించుకొనేందుకు ప్రయత్నించగా.. అది బెడిసికొట్టిందని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. ఆపై గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 14లలో టైటిల్ విజేతగా నిలిచింది.