తామిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు
వీడియో వైరల్ కావడంపై ఆమె కొలంబోలోని శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్లో ఫిర్యాదు చేసింది. తామిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ వీడియో తీశాడని బోరుమంది. తనపై ప్రతీకారంతోనే జయసూర్య ఆ విధంగా చేశాడని ఆమె తన స్నేహితులవద్ద వాపోయింది. జయసూర్య తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకపోవడంతో తాము ఓ గుడిలో నిశ్చితార్థం చేసుకున్నామని ఆమె వెల్లడించింది.
ఇంటర్నెట్ సౌకర్యాన్ని కట్ చేశారు
కాగా, శుక్రవారం ఉదయం నుంచి తమ కార్యాలయానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కట్ చేశారని జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉద్యోగులందరూ సెల్ఫోన్లలో ఆ వీడియోను చూశారని తెలిపాయి. శుక్రవారం విధుల్లో ఉన్న ఆ కార్యాలయ ఉద్యోగుల మొబైల్ ఫోన్లను యాజమాన్యం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
అందుబాటులో లేని జయసూర్య
ఈ విషయమై జయసూర్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అతడు అందుబాటులోకి రాలేదు. అయితే జయసూర్య తనకే పాపం తెలియదని వాదిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయ. అంతర్జాతీయ క్రికెట్కు జయసూర్య వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.
రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన జయసూర్య
రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు జయసూర్య స్థానిక ప్రభుత్వం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. అంతేకాదు శ్రీలంక దేశ ప్రజలకు అందించే దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘దేశబంధు' అవార్డుని కూడా అందుకున్నాడు. ఒకరి వ్యక్తితగ జీవితం గురించి సోషల్ మీడియాలో ఉంచడం చట్టవిరుద్ధం కాబట్టి, సైబర్ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదంటున్నారు.