
సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 11వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ముంబై జట్టు తరుపున టాపార్డర్లో రాణించిన సూర్యకుమార్ ఇప్పటవరకు ఆడిన మ్యాచ్ల్లో 512 పరుగులు నమోదు చేశాడు. దేశావళీ క్రికెట్లో ముంబై తరుపున పరుగుల వరద పారించాడు. 7 మ్యాచ్ల్లో 364 పరుగులు చేశాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ముంబై తరుపున అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో ఆటగాడు. ఇక, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 54.25 యావరేజితో 217 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్
ఈ సీజన్లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కేరళకు చెందిన ఈ క్రికెటర్ 15 మ్యాచ్ల్లో 31.50 యావరేజితో 441 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, దేశవాళీ క్రికెట్లో కూడా సంజూ శాంసన్కు మెరుగైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

శ్రేయాస్ అయ్యర్
ఈ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ డేర్డెవిల్స్కు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు హాఫ్ సెంచరీలతో 37.36 యావరేజితో 411 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్సీ నుంచి గౌతమ్ గంభీర్ వైదొలగడంతో అతడి స్థానాన్ని ఢిల్లీ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్తో భర్తీ చేసింది. అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ నాలుగు విజయాలను నమోదు చేసినప్పటికీ, ఆ జట్టుని ఫ్లే ఆప్స్కు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. కాగా, ఈ ఏడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం అయ్యర్కు రాలేదు.

మయాంక్ అగర్వాల్
ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, జట్టులో పెద్దగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, దేశవాళీ క్రికెట్లో మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ వన్డే ఫార్మాట్లో 8 మ్యాచ్లాడి 723 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 140. ఇక, టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే మూడు హాఫ్ సెంచరీలతో 258 పరుగులు నమోదు చేశాడు.

రిషబ్ పంత్
ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. మొత్తం 15 మ్యాచ్లాడిన రిషబ్ పంత్ 684 పరుగులు చేశాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ నమోదు చేశాడు. ఇక, దేశవాళీ క్రికెట్లో సైతం రిషబ్ పంత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంత్ 411 పరుగులు చేశాడు. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ 24 సిక్సులు బాదాడు.


Click it and Unblock the Notifications












