రెండో వికెట్కు 54 పరుగులు
299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్ (32), రోహిత్ శర్మ(43) మంచి శుభారంభం అందించారు. అనవసర షాట్కు యత్నించి ధావన్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 54 పరుగులు జోడించారు.
క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు
అనంతరం రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరగా, క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కోహ్లీ బాధ్యాతాయుతంగా ఆడాడు. రాయుడు (24) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ధోనితో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను
అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో కెరీర్లో 39వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ అడిలైడ్లో కోహ్లీకి మొత్తంగా ఐదోది కాగా.. వన్డేల్లో రెండవది కావడం విశేషం. ఇదే అడిలైడ్ వేదికగా కోహ్లీ టెస్ట్ల్లో మూడు సెంచరీలు సాధించాడు.
నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం
ఆసీస్ బౌలర్ రిచర్డ్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన కోహ్లీ (104; 112 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్లు) బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్వెల్ క్యాచ్ పట్టడంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో నాలుగో వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భారత ఇన్నింగ్స్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం గమనార్హం.
రన్రేట్ తగ్గకుండా జాగ్రత్త
అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్(25 నాటౌట్)తో కలిసి ధోని(55 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్రేట్ తగ్గకుండా జాగ్రత్తగా ఆడారు. చివరి ఓవర్లో భారత విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతిని ధోని అద్భుతంగా సిక్స్ బాదాడు. ఈ సిక్స్తో ధోని కెరీర్లో 69వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఈ సిరీస్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం
54 బంతుల్లో 55 పరుగులు చేసిన ధోని ఒక్క ఫోర్ లేకుండా.. రెండు సిక్స్లు బాదాడు. మరుసటి బంతిని ధోని సింగిల్ తీయడంతో భారత్.. నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో బెహ్రన్డార్ఫ్, రిచర్డ్సన్, స్టొయినిస్, మ్యాక్వెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.