హైదరాబాద్: సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ఆటగాడు సమీర్వర్మ ఛాంపియన్గా నిలిచాడు. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సమీర్ 16-21, 2-19, 21-14తో ఆరో సీడ్ గ్వాంగ్జు లు (చైనా)పై విజయం సాధించాడు.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సమీర్ వర్మ ఒక గంటా 10 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలి గేమ్ను కోల్పోయినా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని టైటిల్ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ రన్నర్పగా నిలిచి నిరాశపరిచింది.
చైనాకు చెందిన 19 ఏళ్ల యువ షట్లర్ హాన్ యు 18-21, 8-21 స్కోరుతో వరుస గేముల్లో ఓటమిపాలైంది. తొలిగేమ్లో హోరాహోరీగా పోరాడినా.. రెండోగేమ్లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం 8 పాయింట్లే సాధించి పూర్తిగా నిరాశ పరిచింది.
SYED MODI INTERNATIONAL BADMINTON CHAMPIONSHIP 2018 | MS - F - HIGHLIGHTS #badminton #HSBCBWFbadminton pic.twitter.com/q8wWErwBU9
— BWF (@bwfmedia) November 25, 2018
పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ జోడీ 11-21, 20-22తో ఫజర్ అల్ఫియాన్-మహమ్మద్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. మరోవైపు మహిళల డబుల్స్లో టాప్సీడ్గా అడుగు పెట్టిన అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ 15-21, 13-21 తేడాతో మలేసియాకు చెందిన లీమెంగ్ యిన్, చోమీకున్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.