సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజం సింధు అదరగొడుతోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16 తేడాతో బింగ్జియావో(చైనా)పై విజయం సాధించి ఫైనల్లో అడుగపెట్టింది.
కొరియా ఓపెన్: సెమీస్కి సింధు, ఇంటిదారి పట్టిన సమీర్
13-6, 19-9 తేడాతో తొలి సెట్ను సునాయసంగానే గెలుచుకున్న సింధు.. ప్రత్యర్థి బింగ్ జియావో పుంజుకోవడంతో రెండో సెట్ను కోల్పోయింది. మూడో సెట్ హోరాహోరీ జరగ్గా.. సింధు మరోసారి సత్తా చాటింది.
ఒత్తిడిని జయించి బింగ్ జియావోను చిత్తు చేయడం ద్వారా గేమ్ను గెలుచుకుంది. తద్వారా ఫైనల్లోకి అడుగుపెట్టింది. కొరియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు అడుగుపెట్టడం సింధుకు ఇదే తొలిసారి కావడం విశేషం.