|
తొలి మ్యాచ్లో సింధు Vs మారిన్
గతేడాది వరకు చెన్నైకు ఆడిన తెలుగు తేజం పీవీ సింధు ప్రస్తుతం హైదరాబాద్ హంటర్స్ కెప్టెన్గా బరిలో దిగుతోంది. ఇటీవలే వరల్డ్ టూర్ ఫైనల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు మంచి ఫామ్లో ఉంది. టోర్నీలో భాగంగా జరిగే తొలి మ్యాచ్లో పీవీ సింధు-కరోలినా మారిన్ తలపడుతున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ "నాలుగో సీజన్లో హైదరాబాద్కు ఆడుతున్నాను. నా శక్తి మేర ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇలాగే జట్టు సభ్యులు రాణిస్తారని ఆశిస్తున్నా" పేర్కొంది.
|
గచ్చిబౌలిలో 5 మ్యాచ్లు:
ఈ సీజన్లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. ఈనెల 25న చెన్నై స్మాషర్స్తో హైదరాబాద్ హంటర్స్, 26న నార్త్ ఈస్ట్రన్తో దిల్లీ డాషర్స్, 27న ముంబై రాకెట్స్తో నార్త్ ఈస్ట్రన్, 28న అహ్మదాబాద్ స్మాషర్స్తో బెంగళూరు రాప్టర్స్, అవధె వారియర్స్తో హైదరాబాద్ హంటర్స్ తలపడతాయి.
|
గత విజేతలు
- 2013 హైదరాబాద్
- 2016 ఢిల్లీ డాషర్స్
- 2017 చెన్నై స్మాషర్స్
|
నాలుగో సీజన్ హైలెట్స్:
1 - పుణె 7 ఏసెస్కు ఇదే తొలి పీబీఎల్ టోర్నీ.
రూ.6 కోట్లు - ఈసారి పీబీఎల్ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ విలువ. విజేతకు రూ.3 కోట్లు. రన్నరప్ జట్టుకు 1.5 కోట్లు బహుమతిగా దక్కుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు చెరో రూ.75 లక్షలు లభిస్తాయి.
9 - ఈ టోర్నీలో బరిలో దిగుతున్న జట్లు
90 - ఈసారి పీబీఎల్లో ఆడుతున్న క్రీడాకారుల సంఖ్య
17 - లీగ్లో పదిహేడు దేశాల ఆటగాళ్లు లీగ్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
8 - బ్యాడ్మింటన్ ప్రపంచ టాప్-10 ర్యాంకుల్లోని 8 మంది ఈ లీగ్లో ఆడనున్నారు.
|
హైదరాబాద్ హంటర్స్ జట్టు
కెప్టెన్: పీవీ సింధు
పురుషుల సింగిల్స్: లీ హ్యున్ ఇ, చిట్టబోయిన రాహుల్ యాదవ్, మార్క్ కాల్జౌ
మహిళల సింగిల్స్: పీవీ సింధు, సాయి ఉత్తేజిత రావు
పురుషుల డబుల్స్: కిమ్ సా రాంగ్, అరుణ్ జార్జ్, బోదిన్ ఇస్సారా
మిక్స్డ్ డబుల్స్: ఇయొం హె వాన్, జక్కంపూడి మేఘన