న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ ప్రభుత్వంపై గుత్తాజ్వాల సంచలన వ్యాఖ్యలు

By Nageshwara Rao
gutta jwala sensational comments on telangana govt over academy land

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మాజీ ప్లేయర్ గుత్తాజ్వాల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తోన్న తీరును ఆమె తప్పుపట్టారు. అకాడమీని నెలకొల్పేందుకు భూమిని కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు.

గత ఏడాది జూలైలో క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై అప్పట్లో చర్చించింది. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌‌ని ఇచ్చిందని.. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు గుత్తాజ్వాల దూరమై చాలా రోజులవుతుంది. దీంతో ఆమె బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ అకాడమీకి స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించిన సర్కార్ అప్పట్లో అంగీకరించింది.

అయినప్పటికీ ఇంతవరకు అకాడమీకి భూమి కేటాయించకపోవడంపై ఆమె ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Story first published: Monday, August 6, 2018, 19:39 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X