
ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్లో పాల్గొన్న ధోని
తాజాగా ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్లో ధోని పాల్గొన్నాడు. అంతేకాదు కబడ్డీ సైతం ఆడాడు. ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాళ్లని తలపిస్తూ ప్రత్యర్థి కోర్టులోకి కూతకెళ్లిన ధోని ఒకరిని ఔట్ చేసి తొడ కూడా గొట్టాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఇప్పటికే ఎంతో విజయవంతమైంది.
ప్రో కబడ్డీకి బ్రాండ్ అంబాసిడర్గా ధోని
ఈ ఏడాది జరుగుతున్న ఆరో సీజన్కు ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహారిస్తున్నాడు. ధోని ఎండార్స్మెంట్లను పర్యవేక్షించే చేసే రితి స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ షూట్లో అతడు పాల్గొన్న ఫొటోను ట్వీట్ చేసింది. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 21 నుంచి సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది.

టీ20ల నుంచి ధోనిని తప్పించిన సెలక్టర్లు
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. అయితే, ధోని మాత్రం వచ్చే ఏడాది వరకూ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేకపోయింది. జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్లో మాత్రమే ధోని ఆడనున్నాడు.

వన్డేల్లో మాత్రమే జెర్సీని ధరించనున్న ధోని
ఈ వన్డే సిరీస్తో ధోని మళ్లీ భారత జెర్సీని ధరించనున్నాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీని.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కి సెలక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే. ఈ మూడు టీ20ల సిరిస్లో ధోని స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్కు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications













