|
ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు
86 ఏళ్ల భారత హాకీ చరిత్రలోనే ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు. హాంకాంగ్తో మ్యాచ్ అర్ధభాగం పూర్తయింది. అప్పటికే భారత్ 14-0తో ఆధిక్యంలో ఉంది. విరామానికి వచ్చిన ఆటగాళ్లతో కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ "ఇలాగే దూకుడుగా ఆడండి. చరిత్ర సృష్టించండి" అని అన్నారట. కోచ్ మాటలను విన్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి వచ్చాక మరింత దూకుడుగా ఆడారు.
|
ఏకంగా 26 గోల్స్ సాధించి సరికొత్త చరిత్ర
దీంతో ప్రత్యర్ధి హాంకాంగ్కు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఏకంగా 26 గోల్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ అనంతరం కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ "ఈ మ్యాచ్లో చరిత్ర సృష్టించడం సాధ్యమని భావించా. ఆటగాళ్లకు అదే చెప్పా. వెళ్లండి, మీ పేర్లతో చరిత్ర సృష్టించండి అని అన్నాను" అని తెలిపాడు.
వారు నా మాటలను నిజం చేశారు
"వారు నా మాటలను నిజం చేశారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా భారత హాకీ గురించి మాట్లాడుకుంటే తప్పకుండా ఈ విజయాన్ని ప్రస్తావిస్తారు. నేను రికార్డుల గురించి పట్టించుకోను. కానీ, ఆటగాళ్లకు మాత్రం ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. కోచ్ కంటే జట్టు ముఖ్యం. భారత హాకీ చరిత్రలో ఈ 18 మంది ఆటగాళ్ల పేర్లు ఉంటాయి." అని హరేంద్ర చెప్పాడు.
1932 తర్వాత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి
1932 తర్వాత భారత్ ఇంత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి. 1932లో లాస్ ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ 24-1 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ వ్యత్యాసంతో గెలవడం. భారత్ తరఫున 14 మంది ఆటగాళ్లు గోల్స్ నమోదు చేశారు. వీరిలో అక్షదీప్, రూపిందర్, లలిత్ తలో మూడు గోల్స్ సాధించగా హర్మన్ప్రీత్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించాడు. 1994లో న్యూజిలాండ్ 36-1తో సమోవాపై గెలవడమే అంతర్జాతీయ పురుషుల హకీలో రికార్డు.