ఆట ఆరంభం నుంచే భారత్ అటాకింగ్ గేమ్
భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 7న న్యూజిలాండ్తో తలపడుతుంది. ఛెత్రి (68వ, 90వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. జెజె లాల్పెక్లుయా (71వ) మరో గోల్ చేశాడు. రెండు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలతో టీమిండియా దాదాపు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. భారీ వర్షం మధ్య సాగిన మ్యాచ్లో.. ఆట ఆరంభం నుంచే భారత్ అటాకింగ్ గేమ్ ఆడింది. కొన్ని అవకాశాలను సృష్టించుకున్నా గోల్గా మలచలేకపోయింది.
పెనాల్టీ ఏరియాలో సునీల్ను కిందపడేయడంతో
మరోవైపు కెన్యా కూడా అడపాదడపా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఫస్టాఫ్ 0-0తో ముగిసింది. బ్రేక్ తర్వాత భారత్ మరింతగా చెలరేగి పోయింది. ప్రత్యర్థి గోల్ పోస్టుపై పదేపదే దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ద్వితీయార్ధంలో కెన్యా ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించడం భారత్కు కలిసొచ్చింది. పెనాల్టీ కిక్ రూపంలో దక్కిన అవకాశాన్ని సునీల్ గోల్గా మలిచి బోణీ కొట్టాడు. అయితే 68వ నిమిషంలో పెనాల్టీ రూపంలో భారత్ ఖాతా తెరిచింది. పెనాల్టీ ఏరియాలో సునీల్ను కిందపడేయడంతో రెఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీనిని ఛెత్రీ గోల్గా మలచి భారత్కు ఆధిక్యాన్నందించాడు. మూడు నిమిషాల వ్యవధిలోనే కెన్యా ఆటగాడు కొట్టిన రీబౌండ్ను జెజె ఫెకులా గోల్ చేయడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇలా ప్రొత్సహిస్తే.. ప్రాణాలను కూడా పణంగా పెడతాం
మ్యాచ్ అదనపు సమయంలో కెన్యా డిఫెండర్లను కంగుతినిపిస్తూ బల్వంత్సింగ్ అందించిన పాస్ను సునీల్ గోల్ చేయడంతో అభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ సునీల్, సహచర ఆటగాళ్లతో కలిసి అందరికీ అభివాదం చేశాడు. మైదానానికి వచ్చి మమ్మల్ని ఇలా ప్రొత్సహిస్తే.. మా ప్రాణాలను కూడా పణంగా పెడతాం అని సునీల్ ఉద్వేగంగా అన్నాడు. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.
రొనాల్డో, మెస్సీ తర్వాత.. మూడో వాడిగా
సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన సునీల్(61)..స్పెయిన్ ఆటగాడు డేవిడ్ విల్లా(59)ను అధిగమించాడు. ఈ క్రమంలో క్రిస్టియానో రొనాల్డో(81), లియోనల్ మెస్సీ(64) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగానిగా ఛెత్రి నిలిచాడు.