ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా
ఇందుకోసం ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్కు చెందిన రిషి తేజ్, నతనియా జాన్లు ఉన్నారు. టోర్నీలో భాగంగా సోమవారం బెల్జియం, పనామా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రిషి తేజ్ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు.
తొలి భారతీయుడిగా రిషి చరిత్ర
సోచి వేదికగా బెల్జియం-పనామా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఫిఫా అధికారిక మ్యాచ్ బంతిని తీసుకొచ్చే వారిని అఫీసియల్ మ్యాచ్ బాల్ కారియర్స్(ఓఎమ్బీసీ) అంటారు. ఫిఫా ప్రపంచకప్లో ఇలా అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువెళ్లిన తొలి భారతీయుడిగా రిషి చరిత్ర సృష్టించాడు.
ఆనందానికి గురయ్యాను
ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషి తేజ్ మాట్లాడుతూ "ఈ సమయంలో నేను ఎంతో ఆనందానికి గురయ్యాను. ఇప్పటికీ నేను ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాను. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయలేదు. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న దానిపై దృష్టి పెట్టా. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నాడు.
వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు
"వరల్డ్కప్ కోసం రష్యా వెళ్లడానికి ముందు వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు" అని రిషి తెలిపాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా ఉన్న బెల్జియం జట్టు పనామాపై 3-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం బెల్జియం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక, రెండో విద్యార్థి నతనియా జాన్ తమిళనాడుకు చెందినవాడు కాగా, జూన్ 22న బ్రెజిల్-కోస్టారికా మధ్య జరిగే మ్యాచ్కు జాన్ బంతిని అందివ్వనున్నాడు.