
తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్లో "నాకు సెలక్టర్ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు" అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.
అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన సెహ్వాగ్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించాడు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా భారత తరుపున ఈ ఘనత సాధించిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు.
ఆ తర్వాత 2007 వరల్డ్ టీ20, 2011 వన్డే వరల్డ్కప్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక, టెస్టు క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ సెహ్వాగే కావడం విశేషం. కాగా, 2015లో సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ప్రస్తుతం జాతీయ సెలక్షన్ కమిటీకి ఎమ్మెస్కే ప్రసాద్ ఛీఫ్గా ఉన్నారు. మొత్తం ఐదుగురితో కూడిన ఈ కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్దీప్ సింగ్, జతిన్ పరాంజీ, గగన్ ఖోడా ఉన్నారు. ఇక, ఎమ్మెస్కే ప్రసాద్ విషయానికి వస్తే టీమిండియా తరుపున ఆరు టెస్టులు ఆడాడు.