యో-యో టెస్టుని తప్పనిసరి చేసిన బీసీసీఐ
ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చేసరికి వేలంలో కొనుగోలు చేసుకున్న ఆటగాళ్లకు వెంటనే యో-యో టెస్టు నిర్వహించినట్లు ఐపీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘యో-యో టెస్టుని బీసీసీఐ తప్పనిసరి చేసింది. దీంతో దీనిని ఐపీఎల్లో చేర్చడం మంచి పరిణామమే. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్ ఏంటో దీని ద్వారా తెలుస్తుంది' అని ఆయన అన్నారు.
ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం
దీంతో, మిగిలిన నాలుగు ఫ్రాంచైజీలైన సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, చెన్నై సూపర్కింగ్స్ కూడా ఈ యో-యో టెస్టుని నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై రెండేళ్ల పునరాగమనం తర్వాత ఐపీఎల్లో అడుగుపెట్టిన చెన్నైతో తలపడనుంది
యో-యో టెస్టు అంటే ఏమిటి?
యో-యో టెస్టులో భాగంగా భాగంగా రెండువైపులా 20 మీటర్ల దూరంలో రెండు లక్ష్యాలను (కోన్స్) ఏర్పాటు చేసి వాటి మధ్య ఆటగాళ్లను పరుగెత్తిస్తారు. బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి లక్ష్యం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. మొదట్లో బీప్ బీప్కీ మధ్య కాస్త ఎక్కువ సమయం ఇస్తారు. తర్వాత ఈ సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు.
ఆటగాళ్లు
దానికి అనుగుణంగా తగినట్లు ఆటగాళ్లు తమ వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లు ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారని అనిపిస్తే టెస్టును మధ్యలోనే ఆపేస్తారు. ఇదంతా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారానే నిర్వహించి పాయింట్లు నమోదు చేశారు. ఆయా పాయింట్ల ఆధారంగా ఆటగాళ్లు ఫిట్గా ఉన్నారా లేదా అని నిర్ణయిస్తారు.