Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుజారాకి అవమానం: 'ఛీటర్' అంటూ అభిమానుల నినాదాలు (వీడియో)

Fans Call Pujara As 'Cheat' After He Opts Against Walking Out After Edging To Wicket-Keeper
WATCH: Fans call Cheteshwar Pujara a cheat after he opts against walking out after edging to wicket-keeper

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకి అవమానం ఎదురైంది. సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న పుజారాని 'ఛీటర్' అంటూ స్టేడియంలోని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అసలేం జరిగింది?
రంజీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక-సౌరాష్ట్ర జట్లు గత గురువారం నుంచి మ్యాచ్‌ని ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 275 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌరాష్ట్ర జట్టు 236 పరుగులు చేసింది.

45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద

45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద

ఈ ఇన్నింగ్స్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన చతేశ్వర్ పుజారాకి.. అంతక ముందు ఫీల్డ్ అంపైర్ తప్పిదం కారణంగా లైఫ్ లభించింది. బంతి పుజారా బ్యాట్ ఎడ్జ్ తాకి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. పుజారా కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్టు మిన్నకుండిపోయాడు.

పుజారా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తోన్న సమయంలో

దీంతో ఆదివారం ఆట ముగిసిన తర్వాత పుజారా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ‘ఛీటర్.. ఛీటర్' అంటూ స్టేడియంలోని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పుజారా సెంచరీ: రంజీ ఫైనల్లోకి సౌరాష్ట్ర

పుజారా సెంచరీ: రంజీ ఫైనల్లోకి సౌరాష్ట్ర

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పుజారా 266 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 131 నాటౌట్‌గా నిలవడంతో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుజారా(131 నాటౌట్‌) సెంచరీకి తోడు షెల్డాన్‌ జాక్సన్‌(100) కూడా సెంచరీతో రాణించడంతో సౌరాష్ట్ర అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

విదర్భతో ఫైనల్ మ్యాచ్

విదర్భతో ఫైనల్ మ్యాచ్

224/3 ఓ‍వర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా రంజీ ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో తలపడనుంది. ఫిబ‍్రవరి 3వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Monday, January 28, 2019, 13:33 [IST]
Other articles published on Jan 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+