107 పరుగుల వద్ద కోహ్లీ ఔట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ(107) సెంచరీ అనంతరం పెవిలియన్కు చేరగా... గౌతమ్ గంభీర్(150) పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది.
వన్డేల్లో 43 సెంచరీలు
ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ 1377 పరుగులు చేశాడు. కాగా, మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసాడు. దీంతో వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2016లో 2,595 పరుగులు.. 2017లో 2,818 పరుగులు.. 2018లో 2,735 పరుగులు చేశాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), జయసూర్య (13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్ (11,739)లు వరుసగా ఉన్నారు.
27 టెస్టు సెంచరీలు
ఇక, టెస్టుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకోవడంతో భారత్ తరుపున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు.