ఆసియా కప్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతుంది
"కాబట్టి ఆసియా కప్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నా. పాక్ తరఫున ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ. ఆ అనుభవాన్ని నేను ఒకసారి ఎదుర్కొన్నా. గత కొన్నేళ్లుగా యూఏఈ వేదికగా మ్యాచ్లు ఆడుతున్నాం. ఇది మాకు బాగా కలిసొచ్చే అంశం" అని ఫకార్ జమాన్ అన్నాడు.
సెప్టెంబర్ 19న భారత్తో తలపడనున్న పాక్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ని పాకిస్థాన్ జట్టు ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో సెప్టెంబర్ 19న భారత్తో పాక్ తలపడనుంది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో టోర్నీలోనే ఈ మ్యాచ్ని హై ఓల్టేజ్ మ్యాచ్గా అభివర్ణిస్తున్నారు.
ఆసియా కప్లో మొత్తం ఆరు జట్లు
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. ఆసియా కప్ టోర్నీలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మంగళవారం ఆసియా కప్లో పాల్గొనే పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. జట్టు ఎంపికలో పాక్ సెలక్టర్లు ఫిట్నెస్, ఫామ్కి పెద్దపీట వేశారు.
పాకిస్థాన్ జట్టు:
సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది