రాథోర్ మాట్లాడుతూ
బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "ఇది చాలా పెద్ద బాధ్యత. కోచ్లుగా మరియు సహాయక సిబ్బందిగా, క్రికెటర్లుగా జీవితంలో పెద్ద విజయాలను సాధించడంలో వారికి సహాయపడటం మా పని. నేను ఏ విధంగానైనా జట్టుకు మద్దతు ఇస్తున్నాను. నేను బ్యాటర్లతో కలిసి పని చేస్తాను. వారికి అవసరమైన అవసరమైన సాంకేతిక సాయం అందిస్తాను" అని తెలిపాడు.
వారి మనస్తత్వం అర్థం చేసుకోవడానికి
"చాలా చర్చలు జరుగుతాయని నా అభిప్రాయం. నేను వారి మనస్తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, మంచి నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తా. ఈ స్థాయిలో మానవ వనరుల నిర్వహణ అత్యంత కీలకం. ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం, కఠిన పరిస్థితుల్లో అండగా నిలవడం ముఖ్యం. సిరీస్ లేదా మ్యాచ్కు ముందు క్రికెటర్లను ఆదర్శవంతమైన రీతిలో సిద్ధం చేయడమే నా ప్రధాన పని" అని రాథోర్ అన్నాడు.
కోచింగ్ విషయానికి వస్తే
"నేను చాలా ఏళ్లు క్రికెట్ ఆడాను, కాని కోచింగ్ విషయానికి వస్తే నేర్చుకోవాల్సిన అంశం. కోచింగ్ అనేది ఆడటం కన్నా చాలా భిన్నమైనది. నేను బిసిసిఐ నుండి లెవల్ ఎ మరియు బి మరియు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి లెవల్ సికి చేశాను. అక్కడే కోచింగ్ కలను నేర్చుకున్నాను. కోచింగ్ అనేది మీరు మెరుగుపరుచుకునే విషయం అని నేను అనుకుంటున్నాను" అని తెలిపాడు.
|
పొరపాట్లు చేసేందుకు ఆటగాళ్లు భయపడని
"పొరపాట్లు చేసేందుకు ఆటగాళ్లు భయపడని వాతావరణం సృష్టించాలని భావిస్తున్నా. ఎందుకంటే తప్పులు కొత్త విషయాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇస్తాయి. వైఫల్యాల నుంచి నేర్చుకొని ఎదగొచ్చు. రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్, కోహ్లీతో గతంలో కలిసి పనిచేశాను. బ్యాట్స్మెన్తో మంచి అనుబంధం, వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరో స్థాయికి తీసుకెళ్తాను" అని అన్నాడు.
పంజాబ్కు ఆరేళ్లు కెప్టెన్గా వ్యవహరించా
"పంజాబ్కు ఆరేళ్లు కెప్టెన్గా వ్యవహరించిన తర్వాత నేను కోచ్గా సరిపోతానని గ్రహించాను. నా కెరీర్ చరమాంకంలో ఎక్కువగా కోచ్ చేసే పనే చేశాను. 2002లో వీడ్కోలు పలికిన తర్వాత ఆరేళ్లు ఇంగ్లాండ్లో ఉన్నాను. కొత్త ఆలోచనలతో తిరిగొచ్చేందుకు ఈ విరామం అవసరమని భావించా" అని విక్రమ్ రాథోర్ చెప్పుకొచ్చాడు.