33 ఏళ్ల యాసిర్ షా
33 ఏళ్ల యాసిర్ షా పాకిస్థాన్ తరుపున ఇప్పటివరకు 37 టెస్టులు ఆడి 207 వికెట్లు సాధించాడు. అయితే, భారత్తో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టంగా యాసిర్ షా అభివర్ణించాడు. "టీమిండియాతో టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం నా కెరీర్లో ఒక దురదృష్టకరమైన ఘటనే" అని చెప్పాడు.
కోహ్లీకి బౌలింగ్ చేయాలని
"టెస్టుల్లో కోహ్లీకి బౌలింగ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ, వారితో టెస్టు ఆడే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. భారత్తో ఆడాలనే ఉత్సాహం నాలో చాలా ఉంది. ఆ జట్టులో చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉన్నారు. ఒక లెగ్ స్పిన్నర్గా నేను కోరుకునేది ఇదే. కోహ్లీ వంటి అత్యుత్తమ ఆటగాడికి బౌలింగ్ చేయడం కంటే ఆనందం ఏముంటుంది" అని యాసిర్ షా అన్నాడు.
కొన్ని సమయాల్లో
"మీరు కొన్ని సమయాల్లో అనుభూతి చెందుతారు. కానీ ఇది ఆటగాళ్ల నియంత్రణకు సంబంధించిన అంశం కాబట్టి మేము ఏమీ చేయలేము. అవును, త్వరలోనే భారత్తో ఆడే అవకాశం పాకిస్థాన్కు వస్తుందని ఆశిస్తున్నా" అని యాసిర్ షా పేర్కొన్నాడు. పాక్ తరఫున యాసిర్ షా 2011లో అరంగేట్రం చేశాడు.
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత
అయితే, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత పాక్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. దీంతో టీమిండియాతో టెస్టు క్రికెట్ను ఆడే అవకాశం యాసిర్కు రాలేదు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో మాత్రం ఇరు జట్లు తలపడుతున్నాయి.