టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ
ఈ మూడు టీ20ల సిరిస్లో భాగంగా లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గత ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో వెస్టిండిస్పై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తద్వారా టీ20 సిరీస్ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది.
3-0తో టీమిండియాను గెలిపించిన కెప్టెన్ రోహిత్
భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ, వెస్టిండీస్లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్లను గెలిచాయి. అంతేకాదు టీమిండియా వరుసగా 12 అంతర్జాతీయ టీ20ల్లో విజయం సాధించింది.
తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో
తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిపించిన భారత కెప్టెన్గా నిలిచాడు. ఆఖరి టీ20లో రోహిత్ శర్మ ఓ క్యాచ్ను అందుకునే క్రమంలో గాల్లోకి ఎగిరిన ఓ ఫోటోను బీసీసీఐ తన అధికారిక ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసింది. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో విండిస్ బ్యాట్స్మన్ హెట్మెయిర్ బాదిన బంతిని ఆపే క్రమంలో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రోహిత్ శర్మను హ్యారీ పోట్టర్తో పోల్చిన నెటిజన్లు
ఈ ఫోటోపై నెటిజన్లు రోహిత్ శర్మను హ్యారీ పోట్టర్తో పోలుస్తూ తమదైన శైలిలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












