ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 67 పరుగులు అవసరమయ్యాయి.
ఓపెనర్లు విఫలం
ఓపెనర్లు శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరగా... సురేశ్ రైనా(10) సైతం నిరాశపరిచాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. యువరాజ్ సింగ్ (21) పరుగుల వద్ద ఔట్ కావడంతో క్రీజులోకి ధోని వచ్చాడు.
బౌలింగ్కు సహకరిస్తుండడంతో
దీంతో వికెట్ బౌలింగ్కు సహకరిస్తుండడంతో ధోనీ, కోహ్లీ సింగిల్స్, డబుల్స్పైనే దృష్టి పెట్టారు. తమ రన్నింగ్తో ఆసీస్ ఫీల్డర్లను తికమక పెట్టారు. ఒక ఓవర్లో ఏకంగా నాలుగు డబుల్స్ తీశారు. అలా వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్య మధ్యలో ఫోర్లు, సిక్సులు బాదడంతో టీమిండియా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ధోని(18 నాటౌట్) అతడికి మద్ధతివ్వడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ ధోనీ, కోహ్లీ ఫిట్నెస్కు పరీక్ష పెట్టింది. తాజాగా ఆ మ్యాచ్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.