ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు
ఈ జట్టులో ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని ఎంపిక చేయడంతో పాటు రెండో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్కి అవకాశం ఇచ్చారు. దీంతో టీ20ల్లో ధోని కెరీర్ ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనిపై వేటు గురించి బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడారు.
ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ని సిద్ధం చేసుకోవాలనే
"ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగే టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడే అవకాశాలు లేవు. అందుకే.. ఇప్పటి నుంచే జట్టులో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ని సిద్ధం చేసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఈ కారణం కారణంగా ఇకపై టీ20ల్లో ధోనీని ఎంపిక చేయకపోవచ్చు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
కెప్టెన్, వైస్ కెప్టెన్ అనుమతితోనే ధోనిపై వేటు
శుక్రవారం టీ20 జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో చర్చించారు. వారికి తెలియకుండా.. వారి అనుమతి తీసుకోకుండా.. ధోనిపై వేటు వేసే సాహం సెలక్టర్లకు ఉంటుందని నేను అనుకోవడం లేదు" అని ఆయన తెలిపారు.
2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని
2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఆ తర్వాత నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్లో ధోని ఆడటంపై సెలక్టర్లు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ఇలాంటి సమయంలో ధోనిని టీ20 జట్టు నుంచి తప్పించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.