వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం
ముఖ్యంగా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 79 పరుగులు చేసి భారత్కు శుభారంభాన్ని ఇచ్చాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (99) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ కైఫ్ (46), కెప్టెన్ సౌరవ్ గంగూలీ (45), సచిన్ టెండూల్కర్ (28) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారతే విజయపతాకం ఎగరేసి
అంత పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ గెలిచినంత పనిచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడి భారత అభిమానులకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఎట్టకేలకు భారతే విజయపతాకం ఎగరేసింది.
పాక్ కెప్టెన్ కదంతొక్కాడు
పాక్ కెప్టెన్ ఇంజమాముల్ హక్ (122) కదంతొక్కాడు. ఇతనికి తోడు మహ్మద్ యూసఫ్ (73), యూనిస్ ఖాన్ (46), అబ్దుల్ రజాక్ (27), ఇమ్రాన్ ఫర్హాత్ (24) రాణించడంతో ఓ దశలో పాక్ గెలిచేలానే కనిపించింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరం కావడంతో అంతా పాక్దే విజయం అనుకున్నారు. అయితే ఆశిష్ నెహ్రా బంతితో మాయ చేశాడు.
0, 1, 0, 1, 1 గణాంకాలతో నెహ్రా ఐదు బంతులు పూర్తి చేశాడు.
ఆఖరి బంతికి ఆరు పరుగులు
ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు కొట్టాలి. క్రీజులో మొయిన్ ఖాన్ ఉన్నాడు. ఒకటే ఉత్కంఠ. ఆఖరి బంతిని భారీ షాట్ ఆడబోయిన మొయిన్ లాంగ్ ఆన్లో జహీర్ఖాన్ చేతికి చిక్కాడు. అంతే భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అటు పాక్ ఆటగాళ్ల నోట మాటలేదు. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఈ సిరీస్ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది.