గురువారం సింధీస్-కేరళ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్
టీ10 లీగ్ రెండో ఎడిషన్లో భాగంగా గురువారం సింధీస్-కేరళ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సింధీసు జట్టు కేరళ నైట్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కేరళ్ నైట్స్ ఓపెనర్లు క్రిస్గేల్, ఇయాన్ మోర్గాలన్లను తొలి ఓవర్లోనే ప్రవీణ్ తాంబే పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత మ్యాచ్లో భాగంగా కీరన్ పొలార్డ్ను సైతం డకౌట్ చేశాడు.
|
రెండు ఓవర్లు 5 వికెట్లు తీసి 15 పరుగులిచ్చిన తాంబే
మొత్తంగా ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన తాంబే 5 వికెట్లు తీసి 15 పరుగులిచ్చాడు. తాంబే అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత ఇబ్బంది పడిన కేరళ నైట్స్ జట్టు చివరకు దూకుడుగా ఆడటంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింధీస్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాంబేపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
ఈ మ్యాచ్లో కేరళ నైట్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ (50 నాటౌట్)తో రాణించగా డేవ్సిచ్ (49) సూపర్ ఇన్నింగ్స్తో 7.4 ఓవర్లకే సింధీస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్రవీణ్ తాంబే ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు.