హైదరాబాద్: టీమిండియా పేసర్ అశోక్ దిండా గాయపడ్డాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సోమవారం జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా.. బ్యాట్స్మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి ముఖానికి తాకింది. దీంతో ఆశోక్ దిండా పిచ్పైనే కూలబడ్డాడు.
ICC T20I Rankings: టీ20 కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్కి కుల్దీప్ యాదవ్
వివరాల్లోకి వెళితే.. దేశవాళీ టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ' కోసం బెంగాల్ జట్టు సోమవారం ఈడెన్ గార్డెన్స్లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో 34 ఏళ్ల అశోక్ దిండా ఆఫ్ స్టంప్కి వెలుపగా ఫుల్టాస్ బంతిని విసరగా.. ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ వివేక్ సింగ్ దానిని స్ట్రైట్గా ఆడాడు.
దీంతో బంతి నేరుగా వెళ్లి దిండా ముఖాన్ని తాకింది. ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయానికి సిటీ స్కానింగ్ తీసి అనంతరం వైద్యులు దిండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని వెల్లడించారు. 2009, డిసెంబరు 9న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్తో భారత్ జట్టులోకి అశోక్ దిండా అరంగేట్రం చేశాడు.
ఆ తర్వాత నాలుగేళ్లలోనే జట్టుకు దూరమయ్యాడు. చివరిగా 2013లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యాడు.
— Abhishek kumar (@stepwithabhi) February 11, 2019
Pacer Ashok Dinda was hit on the head during a practice game at the Eden Gardens in #Kolkata. A CT scan was done and doctors said that the cricketer was fine.#UserGeneratedContent (@iindrojit)
— India Today (@IndiaToday) February 11, 2019
More videos: https://t.co/FAHzdjSiWA pic.twitter.com/SCYJSpXLgO