మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజి
ఇది మాత్రమే కాదు, గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగిన ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. 2016లో తొలిసారి 50కిపైగా యావరేజిని సాధించిన కోహ్లీ... ప్రస్తుతం టెస్టుల్లో 54.97, వన్డేల్లో 60.02, టీ20ల్లో 52.66 యావరేజిని కలిగి ఉన్నాడు.
ఏడాదిలో వన్డేల్లో 50 కంటే ఎక్కువ యావరేజి ఉన్న ఇతర ఆటగాళ్ళు వీరే:
* 2007లో మాథ్యూ హేడెన్
* 2007లో ఆండ్రూ సైమండ్స్
* 2013లో కుమార్ సంగక్కర
* 2015లో స్టీవ్ స్మిత్
* 2016లో కేఎల్ రాహుల్
* 2017లో ఎబి డివిలియర్స్
మూడు ఫార్మాట్లు కలిపి 2366 పరుగులు
ఇప్పటివరకు 2019లో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 2366 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.
విశాఖలో కోహ్లీ ట్రాక్ రికార్డు ఇదే
ఈ మ్యాచ్లో కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే, అతడి ఖాతాలో మరిన్ని పరుగులు చేరతాయి. విశాఖ స్టేడియంలో విరాట్ కోహ్లీ యావరేజి కూడా ఎక్కువగానే ఉండటం కలిసొచ్చే అంశం. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ యారవేజి 139గా నమోదైంది. ఇక్కడ కోహ్లీ ఆడిన 5 మ్యాచ్ల్లో 556 పరుగులు చేశాడు. దాంట్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం
విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది. ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.
ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. ఈ స్టేడియంలో జరిగిన గత ఆరు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం ఒక్కసారే మాత్రమే విజయం సాధించింది.