విండీస్తో సిరీస్ అతనికి చాలా కీలకం
ఇప్పటికే యువ వికెట్కీపర్ రిషబ్ పంత్కు వన్డే జట్టులో చోటిచ్చిన సెలక్షన్ కమిటీ ప్రపంచకప్ జట్టు ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలని గంగూలీ చెప్పాడు. ‘ప్రపంచకప్లో ధోని కచ్చితంగా రాణించగలడు. ఐతే విండీస్తో సిరీస్ అతనికి చాలా కీలకం. ప్రపంచకప్నకు ముందు ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. అంతిమంగా పరుగులు చేయడమే ముఖ్యం. అందుకే పంత్కు అవకాశం ఇచ్చారు' అని గంగూలీ తెలిపాడు.
ఎప్పుడూ చేయనంతగా తక్కువ స్కోరును
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 వన్డేల్లో పది సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన ధోని 28.12 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్లోనూ ధోనీ నాలుగు సార్లు బ్యాటింగ్ చేసి కేవలం 77 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదీ 19.25 సగటుతో స్ట్రైక్ రేట్ 62.09తో మాత్రమే. అతని కెరీర్ లోనే ఎప్పుడూ చేయనంతగా తక్కువ స్కోరును ఇంగ్లాండ్ పర్యటనలో నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.
ధోనీ రికార్డు చాలా గొప్పదని గంగూలీ
కెరీర్ మొత్తంగా చూస్తే ధోనీ రికార్డు చాలా గొప్పదని గంగూలీ కొనియాడాడు. రాబోయే వరల్డ్ కప్లో మాత్రం ప్రస్తుతం ఎలా ఆడుతున్నారనే అంశంపైనే సెలక్టర్ల వ్యవహరించొచ్చని సూచించాడు. బాగా ప్రదర్శన చేయడమంటే పరుగులు చేయాల్సి ఉంటుందని సౌరవ్ వివరించారు. గతంలోనూ ఆసియా కప్కు ముందు ధోనీ ప్రదర్శనపైనే తర్వాతి వన్డే మ్యాచ్లకు జట్టు ఎంపిక ఉంటుందని గంగూలీ తెలిపాడు.
ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు
వన్డే ఫార్మాట్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అలాగే విండీస్ కూడా అదే స్థాయి పోటీని ఇచ్చే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుత టోర్నీ ఇరు జట్ల మధ్య మంచి రసవత్తరమైన పోరుకు ఆస్కారమిచ్చేలా కనిపిస్తోందన్నట్లు గంగూలీ చెప్పుకొచ్చారు.