బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ
ఈ విషయమై బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "అవును, బ్రాడ్కాస్టర్లు ప్రతిపాదన పంపారు. కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ అనుమతిస్తే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్లో ధోనీని కామెంటేటరి బాక్స్లో చూడొచ్చు" అని తెలిపాడు. అయితే, ఇక్కడ ఒక చిక్కొచ్చిపడింది.
పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల సెగ
ప్రస్తుత బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, ధోని కామెంటేటర్గా వ్వవహారిస్తే అది పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. దీంతో డే-నైట్ టెస్టులో ధోని కామెంటేటర్గా వ్యవహరించే అవకాశం లేదని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన వరల్డ్కప్ సెమీఫైనల్ తర్వాత ధోని రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు.
బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొనసాగుతోన్న ధోని
అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నప్పటికీ ధోని బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాలకు కూడా ఇప్పటికే ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.
భారత్-బంగ్లా ప్రధానులకు ఆహ్వానం
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా టెస్టు మ్యాచ్ను వీక్షించాల్సిందిగా ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానించారు. అయితే, మ్యాచ్లకు ఇలా దేశ ప్రధానులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన మ్యాచ్కు అప్పటి ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసఫ్ రజా గిలానీలు హాజరైన సంగతి తెలిసిందే.