132/8 ఓవర్నైట్ స్కోరుతో
మంగళవారం నాలుగో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌటైంది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను కోల్పోయింది. డి బ్రుయిన్(30) తొమ్మిదో వికెట్గా పెవిలియన్ చేరగా,. లుంగీ ఎంగిడి డకౌటయ్యాడు. చివరి రెండు వికెట్లు నదీమ్కే దక్కాయి.
|
డ్రెస్సింగ్ రూమ్లో ధోని సందడి
రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో జార్ఖండ్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో షాబాజ్ నదీమ్తో ధోని కాసేపు ముచ్చటించాడు. ఈ ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ "చూడండి... ఇక్కడ ఎవరున్నారో" అనే కామెంట్ పెట్టింది.
చివరగా వరల్డ్కప్లో
ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ధోని టీమిండియా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాడు. చివర్లో ధోని రనౌట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని రెండు నెలలు పాటు క్రికెట్కు దూరమయ్యాడు.
బంగ్లా పర్యటనకు దూరం
ఆ తర్వాత విండిస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్కు కూడా ధోనీ అందుబాటులో లేడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు టీ20 సిరిస్ కోసం భారత పర్యటనకు రానుంది. బంగ్లాదేశ్తో జరగనున్న ఈ సిరిస్కు ధోని అందుబాటులో ఉండటం లేదని వార్తలు వచ్చాయి.
|
రవిశాస్త్రితో ధోని
అంతకముందు ధోని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి "అద్భుతమైన సిరిస్ విజయం తర్వాత నిజమైన లెజెండ్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది" అని కామెంట్ పెడుతూ ధోనితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు.
ధోని భవితవ్యంపై గంగూలీ ఇలా
ఇటీవలే ధోని భవితవ్యంపై అతడితో చర్చిస్తానని బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. అక్టోబర్ 24న సెలక్టర్లతో సమావేశం కానున్న గంగూలీ "అక్టోబర్ 24న సెలక్టర్లతో సమావేశమవుతా. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు అభిప్రాయాలను తెలుసుకుంటా. అనంతరం ధోనీతో కూడా స్వయంగా మాట్లాడి.. అతడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుంటా" అని అన్నాడు.