తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత
ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్ కోల్పోకుండా ఆసీస్ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ధోని పరుగులు చేయడంపై జట్టంతా సంతోషంగా ఉంది. ఆత్మవిశ్వాసం తిరిగి పెంపొందించుకోవాలన్నా పరుగులు చేయడం చాలా ముఖ్యం. బయట చాలా మాట్లాడుకుంటారు. విమర్శలు చేస్తారు" అని అన్నాడు.
|
ధోనికి ఉన్న అంకితభావం గురించి
"భారత క్రికెట్ పట్ల ధోనికి ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ధోనీకి ఉన్న అంకితభావం గురించి మాకు తెలుసు. అతనిలా నిబద్ధత ఉన్న క్రికెటర్ మరొకరు లేరు. దేశం కోసం ఎంతో చేసిన అతణ్ని స్వేచ్ఛగా వదిలేయాలి. జట్టు కోసం ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ధోని తెలివైన క్రికెటర్" అని కోహ్లీ వెల్లడించాడు.
నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో
"ఈ పర్యటన చాలా అద్భుతంగా గడిచింది. రెండు ఫార్మాట్లు గెలిచి మూడో దాంట్లో సమంగా నిలిచాం. ఆస్ట్రేలియా రావడానికి ముందు ఇలాంటి ఫలితం గురించి ఎవరైనా చెప్పి ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ సిరిస్లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గెలవడంతో అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడిగా ధోని నిలిచాడు.
మూడో వన్డేలో నాలుగో స్థానంలో
గవాస్కర్ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు. తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. మూడో వన్డేలో అంబటి రాయుడిపై వేటు పడటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు.