1-0 ఆధిక్యంలో భారత్
వీరిద్దరూ ఎంతో సమన్వయంతో ఆడటం వల్ల 236 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో భారత్ ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ధోని 72 బంతుల్లో 59 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లిస్ట్-ఎ క్రికెట్లో 13000 పరుగులు సాధించిన నాలుగో భారత్ క్రికెటర్గా ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
సచిన్, గంగూలీ, ద్రవిడ్ సరసన ధోని
అంతేకాదు మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్, గంగూలీ, ద్రవిడ్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెటర్. 412 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో ధోని ఇప్పటివరకు మొత్తం 13,054 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 50.79 సగటుతో 22,211 పరుగులు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
జాదవ్తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యం
శనివారం ఆసీస్తో జరిగిన మొదటి వన్టేలో కేదార్ జాదవ్తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ధోని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుని కూడా అధిగమించాడు. ఈ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ-ధోని ఇద్దరూ వన్డేల్లో 215 సిక్సులతో సమంగా ఉన్నారు.
రోహిత్ శర్మను అధిగమించిన ధోని
అయితే, హైదరాబాద్ వన్డేలో ధోని 6 ఫోర్లు, ఒక సిక్స్తో రోహిత్ శర్మను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ (195 సిక్సులు), గంగూలీ(189), యువరాజ్ (153) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మార్చి 5(మంగళవారం) నాగ్పూర్ వేదికగా రెండో వన్డే జరగనుంది.