
దృష్టంతా టీ20 వరల్డ్ కప్పైనే
అయితే అప్పటి వరకు తన ఫామా ఎలా ఉంటుందన్నది కీలకమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తన దృష్టంతా 2018లో జరగబోయే టీ20 వరల్డ్ కప్, మిగతా మ్యాచ్ల మీదేనని మిథాలీ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ తర్వాత ఐదు నెలల పాటు విరామం తీసుకున్న భారత మహిళల జట్టు ఏడాది చివర్లో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది.

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్
2017-2020 వరకు జరిగే వన్డే చాంపియన్షిప్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 10 తేదీ వరకు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. వన్డే ఛాంపియన్షిప్లో ప్రతి జట్టు మిగతా జట్లతో స్వదేశంలో, విదేశాల్లో సిరీస్లు ఆడాల్సి ఉంటుంది.

డిసెంబరు నుంచి సన్నాహాలు
ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్కు డిసెంబరు నుంచి సన్నాహాలు మొదలుపెడతామని మిథాలీ చెప్పింది. 'మా దేశవాళీ సీజన్ డిసెంబర్లో మొదలవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు అది సన్నాహకం. మూడు నెలలకు పై గా విరామం తర్వాత మేం మళ్లీ మైదానంలోకి వస్తాం' అని మిథాలీ చెప్పింది.

టాప్-3 జట్లు 2021 ప్రపంచకప్నకు నేరుగా అర్హత
ఇక, వన్డే ఛాంపియన్షిప్లోని టాప్-3 జట్లు 2021లో న్యూజిలాండ్లో జరిగే వన్డే ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన 4 బెర్తుల కోసం ఆరు జట్లతో కలిసి ప్రపంచకప్ అర్హత టోర్నీ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగే సిరీస్తో ఐసీసీ వన్డే ప్రపంచ చాంపియన్షిప్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











