500 క్లబ్బుకి చేరువగా:
ఇప్పటివరకూ.. ప్రస్తుతం ధోనీ 497 (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) మ్యాచ్లతో ఉన్నాడు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లాండ్తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు. ధోనీ ఈ ఎనిమిది మ్యాచ్ల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్లో అతడు ఆడిన మ్యాచ్ల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు ఆడనున్నాడు. ఆ తర్వాత జులై 3న ఇంగ్లాండ్తో టీ20 ఆడనున్నాడు.
3 మ్యాచ్లు ఆడితే ధోనీ:
3 మ్యాచ్లు ఆడితే ధోనీ 500 మ్యాచ్ల క్లబ్లో చేరతాడు. కానీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. గరిష్ఠంగా 664 (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1)తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలో ధోనీ భారత్ తరఫున 500 మ్యాచ్లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.
ధోనీ కంటే ధావన్ కంటే 4 మ్యాచ్లు వెనుకే
అంతేకాదు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు ముగిసేలోపు ధోనీ 505 మ్యాచ్లాడనున్నాడు. అంటే ద్రవిడ్ కంటే కేవలం నాలుగు మ్యాచ్లు వెనుక. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్ ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీలో ధోనీ ఆడితే ద్రవిడ్ రికార్డును బద్దులకొట్టే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా.. సచిన్దే అగ్రస్థానం
అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చుకున్నా సచిన్దే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే(652) ఉన్నాడు. కుమార సంగాక్కర (594) మూడో స్థానంలో ఉండగా మహేంద్ర సింగ్ ధోనీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.