కార్తీక్ను నేను హోటల్ గదికి పిలిచా
'ఆ సాయంత్రం హరారేలో దినేశ్ కార్తీక్ను నేను హోటల్ గదికి పిలిచా. సెలక్టర్ల నుంచి నాకు ఫోన్ వచ్చిందని, నీ పేరును సూచించానని చెప్పాను. ఆ తర్వాత ధోనీని కూడా పిలిచా. తన పేరును కాకుండా కార్తీక్ పేరును ఎందుకు సూచించాల్సి వచ్చిందో వివరించా. ఏదో ఒక రోజు నీకు కూడా అవకాశమొస్తుందని అన్నాను' అని పాటిల్ తెలిపాడు.
జింబాబ్వే పర్యటనలో కార్తీక్ సెంచరీ బాదాడు
'కార్తీక్ సెంచరీ బాదాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. అదే సమయంలో ధోని మ్యాచ్లు ఆడటం లేదు. ఆ తర్వాత మేం కెన్యా వెళ్లాం. అక్కడ అతడు చెలరేగిపోయాడు' అని పాటిల్ తెలిపాడు. అప్పుడు అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కార్తీక్ స్థానంలో సరిగ్గా ఏడాది తర్వాత ధోని భారత జట్టులోకి వచ్చాడు.
వ్యక్తిగత సమస్యలు అతడిని ఇబ్బంది పెట్టాయి
'అప్పుడు కార్తీక్ భిన్నమైన ఆటగాడు. భారత జట్టులో చోటు దొరకగానే, స్ట్రెయిట్గా ఆడాలని చాలా మంది ఆటగాళ్లు భావిస్తుంటారు. తమ శైలి మరిచిపోతారు. కార్తీక్ విషయంలోనూ అదే జరిగింది. కార్తీక్ తనదైన ఆటను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలు కూడా అతణ్ని ఇబ్బందిపెట్టాయి' అని సందీప్ పాటిల్ అన్నాడు.
జింబాబ్వే పర్యటనలో సెంచరీ నమోదు
'షాట్ ఆడితే ఔటైపోతామేమో అని యువ ఆటగాళ్లు భయపడుతుంటారు. రంజీ ట్రోఫీ, భారత్ ఏ జట్టుకు ఆడేటప్పుడు కార్తీక్లో ఆ భయం లేదు. అందుకే జింబాబ్వే పర్యటనలో సెంచరీని నమోదు చేశాడు. నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. లక్కీగా ధోని కూడా అదే జింబాబ్వే పర్యటనలో ఉన్నాడు' అని పేర్కొన్నాడు.