
అంఫైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జేసన్ రాయ్
ఈ మ్యాచ్లో అంపైర్ ఔట్ నిర్ణయం ప్రకటించడాన్ని జేసన్ రాయ్ తప్పుపట్టాడు. అంతేకాదు అంఫైర్ కుమార ధర్మసేనతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఐసీసీ నియమావళిని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన ప్రకారం అతడిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది.

రెండు డీమెరిట్ పాయింట్లు సైతం
దీంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను కూడా జత చేసింది. దీంతో వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ కావడంతో అతడిపై నిషేధాన్ని తప్పించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు.

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో
ప్యాట్ కమ్మిన్స్ వేసిన మ్యాచ్ 20వ ఓవర్లో రాయ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. టీవీ రిప్లేలో మాత్రం బంతి.. బ్యాట్కు తాకలేదని స్పష్టంగా కనిపించింది. అంపైర్ మాత్రం రాయ్ను ఔట్ చేస్తూ నిర్ణయం ప్రకటించాడు. ఆ సమయంలో అంపైర్తో రాయ్ వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసేందుకు గాను 50 బంతులు తీసుకున్న జేసన్ రాయ్ ఆ తర్వాత 15 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు.

65 బంతుల్లో 85 పరుగులతో టాప్ స్కోరర్గా
దీంతో మొత్తం 65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 85 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జేసన్ రాయ్ ఔటైన తర్వాత ఇయాన్ మోర్గాన్(45 నాటౌట్), జో రూట్(49 నాటౌట్) రాణించి ఇంగ్లాండ్ను ఫైనల్కు చేర్చింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత తమ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.


Click it and Unblock the Notifications












