4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 14 పరుగులు
ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన బుమ్రా 2 వికెట్లు తీసి 14 పరుగులు ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. మలింగ వేసిన 16వ ఓవర్లో చెన్నై బ్యాట్స్మెన్లు వాట్సన్, బ్రావోలు దూకుడుగా ఆడి 20 పరుగులు రాబట్టారు.
బుమ్రా ఇచ్చింది కేవలం నాలుగు పరుగులే
అయితే, ఆ తర్వాతి ఓవర్లో బౌలింగ్కు వచ్చిన బుమ్రా కేవలం నాలుగే పరుగులిచ్చి ముంబైని పోటీలో నిలబెట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో చెన్నై విజయ సమీకరణం 2 ఓవర్లలో 18 పరుగులుగా మారింది. ఆ తర్వాత మళ్లీ బుమ్రా... బ్రావో వికెట్ తీసి 9 పరుగులే ఇచ్చాడు.
డికాక్ తప్పిదం వల్ల బైస్
ఇందులో ఒక ఫోర్ కీపర్ డికాక్ తప్పిదం వల్ల వచ్చిన బైస్ కావడం గమనార్హం. ఇలా మలింగ, హార్దిక్ పాండ్యా భారీ పరుగులు సమర్పించుకున్నప్పటికీ... బుమ్రా ఆ తర్వాతి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక, ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి.
|
ఆఖరి ఓవర్ మలింగకు ఆశ్చర్యం
ఈ దశలో కెప్టెన్ రోహిత్ అంతకముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చుకున్న మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, మలింగ తన అనుభవంతో ముంబైని గెలిపించాడు. ఆఖరి ఓవర్లో కేవలం 7 పరుగులే ఇచ్చి ముంబైకి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ని అందించాడు.