
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అటు బ్యాటింగ్లోనూ, ఇటు వికెట్ కీపింగ్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
23 బంతుల్లోనే 42 పరుగులు రాబట్టి ముంబైని భారీ స్కోరుని పరిగెత్తించాడు. తొలి 7 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. రాహుల్ తెవాతియా వేసిన ఇన్నింగ్స్ 13 ఓవర్లలో నాలుగో బంతిని ఫోర్గా మలిచిన ఇషాన్ మరుసటి బంతికి రివర్స్ స్వీప్తో సిక్స్ బాదాడు.
ఆ తర్వాతి బంతికి మరో సిక్స్ బాదడం ద్వారా మూడు బంతుల్లోనే 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్లో రెండు బౌండరీలు బాదాడు. ఇలా దూకుడుగా ఆడే క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ కిషన్ను డానియేల్ క్రిస్టెన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడబోయి బౌల్డ్ చేశాడు.
దీంతో ఐపీఎల్లో రెండో అర్ధ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. కాగా, గత మ్యాచ్లో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అందుకున్న ఇషాన్.. అంపైర్ ఔటివ్వకపోవడంతో డీఆర్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. డీఆర్ఎస్ ఫలితం ఇషాన్ కిషాన్కు అనుకూలంగా వచ్చింది. ఇదే మ్యాచ్లో ఓపెనర్ సాహాను ఎల్బీగా పెవిలియన్కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు.