పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక
ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఏదైనా కారణం చేత ఐపీఎల్ మ్యాచ్లు రద్దు అయినా లేక ఆలస్యమైనట్లైతే తద్వారా వాటిల్లే నష్టాన్ని బీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకున్నాయి. మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజీ ఉంది.
ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా కూడా ఈసారి బీమా
అంతేకాదు ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా కూడా ఈసారి బీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్లు ఎక్కువ అవడంతో ఈ ఏడాది బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచాయి. ఇక, ఐపీఎల్ 2018 సీజన్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఈ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది.
ఐపీఎల్ 11వ సీజన్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ఫిఫా, వింబుల్డన్ లాంటి టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఐపీఎల్ ద్వారా ఆటగాళ్ళకు లభించేది మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్లో విజేత జట్టుకిచ్చే మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.56 కోట్లు. టోర్నీ విజేతగా నిలిచిన జట్టు మొత్తానికి కలిపి ఇచ్చేది రూ.26 కోట్లు, రన్నరప్కు అందులో సగం అంటే రూ.13 కోట్లు అందిస్తారు.
తొలి మ్యాచ్ ముంబై-చెన్నై జట్ల మధ్య
ఇక ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లకు బహుమతులు ఇస్తారు. ఇవన్నీ కలుపుకుంటే రూ.56 కోట్లు. శనివారం ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.