రాహుల్కు సరైన బ్యాకప్
టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్గా ఉన్న రిషభ్ పంత్కు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. దీంతో అతను వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను టీం మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. అయితే అతని బ్యాకప్ ఎవరనే ప్రశ్న మేనేజ్మెంట్కు పెద్ద సమస్యగా మారింది. కిషాన్ ఓపెనర్ కావడంతో అతన్ని రాహుల్ బ్యాకప్గా ఎవరూ అనుకోలేదు. సంజూ శాంసన్ ఉన్నప్పటికీ అతను గాయంతో ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఉపయోగించుకొని, కివీస్పై రాణిస్తే రాహుల్ బ్యాకప్గా అతను తన స్థానాన్ని పదిలం చేసుకునే ఛాన్స్ ఉంది.
మిడిలార్డర్లో కీలకం
కివీస్తో సిరీస్లో కొత్త రోల్లో ఆడనున్న ఇషాన్ కిషన్కు ఇది సువర్ణావకాశంలా కనిపిస్తోంది. రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఈ సిరీస్ ఆడటం లేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్కు చోటు దక్కడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కిషన్ కనుక కొత్త రోల్లో రాణిస్తే అతను మిడిలార్డర్లో కూడా చాలా కీలకంగా మారతాడు. సాధారణంగా ఓపెనర్గా వచ్చే కిషన్కు వన్డే ఫార్మాట్లో అవకాశం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించడమే దీనికి కారణం. కాబట్టి మిడిలార్డర్లో కనుక తన సత్తా నిరూపించుకుంటే జట్టుకు మరిన్ని ఆప్షన్స్ దొరికనట్లే.
ఆసీస్ టూర్కు కీలకం
ఇషాన్ కిషన్కు తొలి సారి భారత టెస్టు టీం నుంచి పిలుపొచ్చింది. ఆసీస్తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేశారు. రిషభ్ లేకపోవడంతో అతని స్థానంలో ఎవర్ని దింపాలనే సమస్య తలెత్తింది. కిషన్ కనుక కివీస్తో సిరీస్లో మిడిలార్డర్లో రాణిస్తే.. ఆస్ట్రేలియా టెస్టుల్లో కూడా మేనేజ్మెంట్ అతనివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిరీస్లో రాణించడం, ముఖ్యంగా మిడిలార్డర్లో తన విలువ చూపించుకోవడం అతనికి చాలా అవసరం. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కివీస్ పేసర్లను ఎదుర్కోవడం కూడా మంచి అనుభవమే.