భారత్కు పేసర్ల తిప్పలు..
భారత జట్టులో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే దగ్గరదగ్గరగా 140 కిలోమీటర్ల సగటు వేగాన్ని మెయిన్టైన్ చేస్తున్నాడు. మిగతా వాళ్లంతా 130లలోనే ఉన్నారు. యువబౌలర్లు కూడా వేగంగా బౌలింగ్ చేయడం లేదు. ప్రస్తుతం భారత దేశంలో ఫాస్ట్ బౌలింగ్ అంటే గుర్తొచ్చేది కేవలం ఉమ్రాన్ మాలిక్ మాత్రమే. అతను కూడా 150 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించేసుకొని, 140 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేయడం మొదలు పెట్టడం గమనార్హం.
ఐపీఎల్ ఆడితే పడిపోతున్న వేగం
ఈ విషయంతో పేస్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ స్పందించాడు. ఐపీఎల్ మొదలైన తర్వాత భారత జట్టు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవలేదని చెప్పిన అక్రమ్.. భారత బౌలర్లు ఐపీఎల్ ఆడితే వారి వేగం పడిపోతోందని చెప్పాడు. 'ఆవేశ్ ఖాన్ను చూడండి. అతను 140-145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆ స్పీడ్ 130-135 కిలోమీటర్లకు పడిపోయింది' అన్నాడు. ఏటా రూ.24 కోట్ల వరకు సంపాదిస్తుంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏముంటుందన్నాడు.
బీసీసీఐకి సూచన
ఇలా ఐపీఎల్ ఆడిన తర్వాత బౌలర్ల వేగం ఎందుకు పడిపోతుందో బీసీసీఐ గుర్తించాలని అక్రమ్ సూచించాడు. అలాగే ఆట మీద ఆకలి ఎలా ఉంటుందో యువప్లేయర్లకు తెలిసేలా చూడాలని, అవసరం అయితే ఐపీఎల్లో వారి ధరకు ఒక పరిమితి విధించాలని సలహా ఇచ్చాడు. మరి ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని భారత బౌలింగ్ విభాగాన్ని బీసీసీఐ బలోపేతం చేస్తుందేమో చూడాలి.