|
ఒక మార్పుతో బరిలోకి దిగిన వెస్టిండిస్
మరోవైపు వెస్టిండిస్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు తరుపున ఒబెద్ మెక్కాయ్ అరంగేట్రం చేస్తున్నాడు. థామస్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సునాయాసంగా గెలిచిన కోహ్లీ సేన.. ఇప్పుడు అచ్చొచ్చిన వైజాగ్ మైదానంలో జోరు కొనసాగించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
నాలుగు వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 399 పరుగులు
మరోవైపు వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేయాల్సిన పరుగులు 81 కాగా.. ఈ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 399 పరుగులు చేశాడు. ఇందులో 118, 117, 99, 65 రూపంలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
|
టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్
కాగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లాడిన జట్టుగా భారత్ అరుదైన ఘనత వహించింది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్లో 949మ్యాచ్లాడిన భారత్.. 490మ్యాచ్ల్లో విజయం సాధించగా, 411మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇక భారత్ తర్వాత 916 వన్డేలాడి ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
|
556విజయాలతో ముందంజలో ఆస్ట్రేలియా
గెలుపు-ఓటమిల పరంగా చూసుకుంటే మాత్రం ఈ ఫార్మాట్లో మొత్తం 556విజయాలతో ఆస్ట్రేలియానే ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా కేవలం 317 మ్యాచ్లలో మాత్రం ఓటమిపాలైంది. మరోవైపు వన్డేల్లో అత్యధిక మ్యాచ్లాడిన జట్ల జాబితాలో మూడో స్థానంలో పాకిస్థాన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 899 వన్డే మ్యాచ్లాడిన పాక్.. 476 విజయాలు, 397 పరాజయాలు చవిచూసింది. నాలుగో స్థానంలో శ్రీలంక(827), ఐదో స్థానంలో వెస్టిండీస్(781) కొనసాగుతున్నాయి.
|
భారత్ తుది జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ