ఆరో ఓవర్లో స్మృతి మందానను పెవిలియన్కు
దూకుడుగా ఆడుతున్న క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఈ జోడీని విడగొట్టింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్మృతి మందానను పెవిలియన్కు చేరగా, తర్వాతి ఓవర్లోనే భాటియా కూడా ఔటైంది. దీంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది.
మూడో వికెట్కు 36 పరుగులు
వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు వీరిద్దరూ కలిసి 36 పరుగులు జోడించారు. ఆ సమయంలో రోడ్రిగ్స్ రనౌట్గా పెవిలియన్కు చేరడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. ఆ తర్వాత భారత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఆకట్టుకోలేకపోయింది.
మహిళల వరల్డ్ టీ20: వెస్టిండిస్ ఓటమి, పైనల్లో ఆస్ట్రేలియా
19.3 ఓవర్లలో 112 పరుగులకే భారత్ ఆలౌట్
చివర్లో టెయిలెండర్లు సైతం చేతులెత్తేయడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాట్స్ ఉమెన్లలో ఓపెనర్ స్మృతి మంధాన(34) టాస్ స్కోరర్గా నిలవగా, రోడ్రిగ్స్ (26) ఫరవాలేదనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ నైట్ మూడు వికెట్లు, ఎక్లేస్టన్, జోర్డాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆడుతూ పాడుతూ చేధించింది. ఇంగ్లాండ్ను ఇన్నింగ్స్లో రెండో ఓవర్లోనే రాధా యాదవ్ దెబ్బకొట్టింది. ఒక పరుగు మాత్రమే చేసిన బ్యూమౌంట్ మిడాన్లో ఉన్న అరుందతీ రెడ్డి చేతికి చిక్కింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డానీ వ్యాట్ కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటైంది.
మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం
దీంతో భారత్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నాటాలీ స్కివర్-అమీ అలెన్ జోన్స్ జోడీ మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్కు విజయాన్ని అందించారు. స్కివర్ (52), జోన్స్ (53) హాఫ్ సెంచరీలతో చెలరగడంతో పాటు మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో మరో 17 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది.
అమీ జోన్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
భారత బౌలర్లలో దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ క్రికెటర్ అమీ జోన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది. నవంబర్ 24న ఆంటిగ్వా వేదికగా ఫైనల్ జరగనుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి.