|
బుడ్డోడితో కోహ్లీని అవుట్ చేస్తామంటూ:
కోహ్లీని ఔట్ చేస్తానంటూ రంగలోకి దిగాడు ఓ బుడతడు. అడిలైడ్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. ఆ మ్యాచ్ కోసం బుధవారం ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి ఆ పిల్లాడు కాసేపు ప్రాక్టీస్ కూడా చేశాడు. తన లెగ్ స్పిన్తో విరాట్ కోహ్లీ వికెట్ పడగొడతానని ఆరేళ్ల ఆర్చీ స్కిల్లర్ ధీమా వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
|
లెగ్ స్పిన్ వేసి పడగొడతానని
ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ నేరుగా ఫోన్ చేసి స్కిల్లర్తో మాట్లాడాడు. ఆసీస్ జట్టులోకి తీసుకుంటే ఏం చేస్తావంటే విరాట్ కోహ్లీని అవుట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. నీకది అంత సులువా అంటే అవునంటూ చెప్పాడు. అవునా బౌలింగ్ చేస్తావా.. అంటే లెగ్ స్పిన్ వేస్తానని తెలిపాడు. మూడు గంటపాటు ఆస్ట్రేలియా జట్టు చేసిన ప్రాక్టీస్లో ఆ పిల్లాడు పాల్గొన్నాడు. ఆ తర్వాత చిన్నారితో ఆసీస్ జట్టు సభ్యులు సరదాగా ఫొటోలు దిగారు. వీటిని ఆస్ట్రేలియా అధికారిక ట్విట్టర్ ద్వారా తన అకౌంట్లో పోస్టు చేసింది.
నాలుగు సెంచరీలతో పాటు 692 పరుగులతో
ఆస్ట్రేలియా గడ్డపై 2014-15లో చివరిసారి భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడగా.. విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలతో పాటు 692 పరుగులతో సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా పర్యటనలోనూ అతను చెలరేగుతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. ఆస్ట్రేలియా బౌలర్లు అతడ్ని నిలువరించేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ని గెలవలేక
దీంతో.. పోరు కోహ్లి vs ఆస్ట్రేలియాగా మారిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ కాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టు కనీసం ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ని గెలవలేకపోయింది. దీంతో.. అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్ని ఈసారి కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.