హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన బుమ్రా అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసిన రెండో భారత బౌలర్గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి టీ20లో భారత్ ఓటమి: ధోని అతి విశ్వాసమే కొంప ముంచిందా?
భారత్ తరుపున బుమ్రా (51) వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (52) వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బుమ్రా తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి హ్యాండ్ స్కాంబ్ను ఔట్ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్ నైల్ను బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా కౌల్టర్నైల్ను బౌల్డ్ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.
What an Over ! 2 runs, 2 wickets @Jaspritbumrah93 🇮🇳 🙏👌👌#INDvAUS pic.twitter.com/xZUIb8sRUu
— Aman Gavaskar (@aman_gavaskar) February 25, 2019
బుమ్రా వేసిన ఇన్స్వింగ్ యార్కర్కు కౌల్టర్ నైల్ దగ్గర సమాధానమే లేదు. వికెట్ సైతం అమాంతం గాల్లోకి ఎగిరింది. ఆ బంతిని చూసిన అబిమానులు సైతం అవాక్కయ్యారు. తొలి బంతికి కమిన్స్ సింగిల్. రెండో బంతిని డీప్ స్క్వేర్లెగ్లో బౌండరీకి తరలించాడు రిచర్డ్సన్. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు. నాలుగో బంతికి సింగిల్.
చివరి రెండు బంతుల్లో ఆసీస్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఆఫ్ స్టంప్ ఆవల ఉమేశ్ వేసిన ఫుల్టాస్ బంతిని కమిన్స్ కవర్స్లో బౌండరీకి తరలించాడు. దీంతో ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. వికెట్లను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతిని కమిన్స్ స్ట్రెయిట్గా ఆడాడు.
ఆ బంతికి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆస్టేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య బుధవారం బెంగళూరు వేదికగా రెండో టీ20 జరగనుంది.