2-2తో సిరిస్ సమం
దీంతో సిరిస్ 2-2తో సమం అయింది. దీంతో బుధవారం ఢిల్లీ వేదికగా జరగనున్న ఆఖరి వన్డే ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. వరల్డ్కప్కు ముందు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో పాల్గొనాలని కోహ్లీసేన భావిస్తోంది.
భారత్ తలపడిన ద్వైపాక్షిక సిరీస్లో 11 సార్లు
2015 వరల్డ్కప్ తర్వాత టీమిండియా తలపడిన ద్వైపాక్షిక సిరీస్లో 11 సార్లు (సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్) మ్యాచ్ ద్వారానే విజయం ఆయా జట్ల సొంతమైంది. ఇలాంటి సందర్భాల్లో కేవలం రెండు సార్లు మినహా మిగిలిన అన్ని సార్లు టీమిండియానే విజయం సాధించింది. 2015-2016 సీజన్లో ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో ఓడిపోగా... 2018-2019 సీజన్లో ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన సిరీస్ కోల్పోయింది.
మిగతా తొమ్మిదిసార్లూ టీమిండియాదే విజయం
మిగతా తొమ్మిదిసార్లూ ద్వైపాక్షిక సిరీస్ల్లో నిర్ణయాత్మక మ్యాచ్లను భారత్ సొంతం చేసుకుంది. దీంతో ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నాం జరగనున్న ఆఖరి వన్డేపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు 2009లో ఆస్ట్రేలియా ఇక్కడ ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. అయితే సిరీస్లో 0-2తో వెనుకబడ్డ సందర్భాలలో భారత్ వన్డే సిరీస్ గెలిచిన దాఖలాల్లేవు.
భారత్-ఆసీస్ మధ్య చివరి ఐదు మ్యాచ్ల సిరీస్ ఇది
2020లో వన్డే లీగ్ మొదలుకానున్న నేపథ్యంలో.. భారత్-ఆసీస్ మధ్య చివరి ఐదు మ్యాచ్ల సిరీస్ ఇది. ఇక నుంచి జరుగబోయే ప్రతి సిరీస్లో మూడు మ్యాచ్లే ఉంటాయి. గత రెండు మ్యాచ్ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కాలేదు. 2016 అక్టోబర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా.. 2014లో మాత్రం విండీస్పై 48 పరుగుల తేడాతో గెలిచింది